For Money

Business News

రూ.450 కోట్లతో ‘అపర్ణా’ కొత్త ప్రాజెక్ట్‌

హైదరాబాద్‌లో పేరొందిన నిర్మాణ సంస్థ అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. కొంపల్లి వద్ద ‘అపర్ణా కనోపీ ఎల్లో బెల్స్‌’ పేరుతో కొత్త నివాస గృహాల సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. 10.5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 1,050 అపార్ట్‌మెంట్‌లు ఉంటాయని అపర్ణా కన్‌స్ట్రక్షన్‌ డైరెక్టర్‌ రాకేష్‌ రెడ్డి తెలిపారు. పది టవర్లను నిర్మిస్తున్నాం.. ఒక్కో టవర్లో 15 అంతస్తులు ఉంటాయి. రూ.450 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు. కంపెనీకి ఇది 59వ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు. ‘కనోపీ ఎల్లో బెల్స్‌’ నిర్మాణం 2025 మార్చి నాటికి పూర్తవుతుందని తెలిపింది.
ఈ ఏడాది తమ కంపెనీ 25వ వార్షికోత్సవం జరుపుకుంటోందని, ఈ సందర్భంగా అన్ని మార్కెట్లను ఆకర్షించే విధంగా విస్తరణ ప్రణాళిక చేపట్టామని రాకేష్‌ రెడ్డి అన్నారు. 6 కోట్ల చదరపు అడుగుల ప్రాజెక్టులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. తమ పోర్టుఫోలియోలో 59 ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలో మధ్య, చిన్న తరహా పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించామని ఆయన అన్నారు.