ఐపీవోకి వైభవ్ జ్యూవెల్లర్స్
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ వైభవ్ జ్యూవెల్లర్స్..క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ప్రాస్పెక్టస్ను సెబీ వద్ద దాఖలు చేసింది. ఈ ఐపీవో ద్వారా రూ.210 కోట్ల నిధులను సేకరించాలని సంస్థ భావిస్తున్నది. పబ్లిక్ ఆఫర్లో భాగంగా కంపెనీ ప్రమోటర్ గ్రంధి భారత మల్లిక రత్న కుమారి(హెచ్యూఎఫ్)కి చెందిన 43 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్-ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఐపీవో ద్వారా సేకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార విస్తరణకోసం, ఇన్వెంటరీని కొనుగోలు చేయడానికి ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.