For Money

Business News

ఇవాళా పెరిగిన పెట్రో ధరలు

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము విధిస్తున్న పన్నులు తగ్గించేందుకు ఏమాత్రం ఇష్ట పడటం లేదు. దీంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నాయి. ఇవాళ పెట్రోల్‌ ధరను 27 పైసలు, డీజిల్‌ ధరను 28 పైసలు మేరకు పెంచాయి. విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.52కు చేరగా డీజిల్‌ధర రూ. 95.91కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.98.48 చేరగా, డీజిల్‌ రూ.93.38 కు పెరిగింది.