For Money

Business News

9 నుంచి టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌

ఈ నెల 9వ తేదీ అంటే బుధవారం నుంచి టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 23 వరకు బైబ్యాక్‌లో పాల్గొనాలని భావిస్తున్న వాటాదారులు తమ వద్ద ఉన్న టీసీఎస్‌ షేర్లను కంపెనీకి ఆఫర్‌ చేయవచ్చు. ఇందుకోసం ఒక్కో షేరు ధరను కంపెనీ రూ.4.500గా నిర్ణయించింది. గత శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ముగింపు ధర రూ.3,525.20. బైబ్యాక్‌కు ఎంపికైన షేర్లకు రూ.974.80 ఎక్కువగా కంపెనీ చెల్లిస్తుందన్నమాట. మొత్తం నాలుగు కోట్ల షేర్లను కంపెనీ ఈ బైబ్యాక్‌ కింద కొనుగోలు చేస్తుంది. గత నెల 23 నాటికి కంపెనీ రికార్డుల్లో షేర్లు ఉన్న వాటాదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ బైబ్యాక్‌ కోసం కంపెనీ రూ.18,000 కోట్లు ఖర్చు చేస్తుంది.