For Money

Business News

అది వదంతి మాత్రమే…

చెన్నైకు అమరరాజా బ్యాటరీస్‌ను తరలిస్తారనేది వదంతి మాత్రమేనని, వదంతులకు తాము స్పందించమని ఎంపీ గల్లా జయదేవ్‌ వ్యాఖ్యానించారు. వివాదాస్పద ప్రశ్నలకు దూరంగా ఉంటామని చెప్పారు. తండ్రి రామచంద్రనాయుడుతో కలిసి తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా పత్రికలు, చానళ్లలో ఒక వార్త వస్తోందని, మంచైనా చెడైనా ఇంతవరకూ దానిపై తాము స్పందించలేదన్నారు. విషయం కోర్టు పరిధిలో ఉందని, కోర్టుకు సమాధానం చెబుతామని పేర్కొన్నారు. కోర్టు నిర్ణయం తర్వాత స్పందిస్తామని గల్లా జయదేవ్‌ వివరించారు.