ఈ రెండు షేర్లు కొనండి
ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్కు చెందిన సంజీవ్ భాసిన్ మార్కెట్ ర్యాలీపై చాలా ధీమాగా ఉన్నారు. ఈ ర్యాలీ నిఫ్టిని 17000 దాకా తీసుకెళుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. హిందీ బిజినెస్ ఛానల్ ‘జీ బిజినెస్’తో మాట్లాడుతూ.. అమెరికాలో పరిస్థితి మెరుగుపడుతోందని.. ఇదే ఇక్కడ ప్రతిఫలిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇన్వెస్టర్లకు రెండు షేర్లను రెమెండ్ చేశారు.
ఆయన సిఫారసు చేసిన తొలి షేర్ నాల్కో. 8 శాతం డివిడెండ్ ఇస్తున్న ఈ షేర్ చక్కటి పనితీరు కనబరుస్తుందని ఆయన అన్నారు. బాక్సైట్, అల్యూమినియంను చాలా తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేస్తున్న నాల్కోను కొనుగోలు చేయొచ్చని ఆయన అన్నారు. రూ. 90 స్టాప్లాస్తో రూ. 105 టార్గెట్తో కొనుగోలు చేయొచ్చని ఆయన సిఫారసు చేశారు. ప్రస్తుతం ఈ షేర్ రూ. 94.55 వద్ద ట్రేడవుతోంది. ఇక ఆయన రెకమెండ్ చేసిన రెండో షేర్ హిందాల్కో. ఈ షేర్ ఇపుడు రూ. 415 వద్ద ట్రేడవుతోంది. రూ. 440 టార్గెట్ కోసం రూ. 400 స్టాప్లాస్తో హిందాల్కో షేర్ను కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు.