For Money

Business News

రుచి సోయా FPO ధర ఖరారు

పతంజలి గ్రూప్‌నకు చెందిన రుచి సోయా కంపెనీ ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) మార్చి 24న ప్రారంభం కానున్న విషయం తెలిసింది. ఈ ఆఫర్‌కు ధర శ్రేణి రూ. 615- రూ.650గా నిర్ణయించారు. గరిష్ఠ ధర రూ.650ని పరిగణనలోకి తీసుకున్నా… ఈ ధర మార్కెట్‌ ధరకు 35 శాతం తక్కువ. కనీసం 21 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆఫర్‌ ఈనెల 28న ముగుస్తుంది. సెబి నిబంధనల మేరకు కంపెనీలో ప్రమోటర్లు తన వాటాను తగ్గించుకోవవాల్సి ఉన్నందున రూ.4,300 కోట్ల విలువైన షేర్లను FPO కింద రుచి సోయా విక్రయిస్తోంది. షేర్లు ఏప్రిల్‌ 5 కేటాయిస్తారు. ఆరున ట్రేడింగ్‌కు జరుగుతుంది. షేర్లు దక్కనివారికి నిధులను ఏప్రిల్‌ 4వ తేదీన రీఫండ్‌ చేస్తారు.