For Money

Business News

నేటి నుంచి రుచి సోయా ఎఫ్‌పీఓ

బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్‌ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇష్యూ ఈనెల 28న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 4300 కోట్లను సమీకరించదలచింది. బుధవారం రూ.1290 కోట్లను యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన కంపెనీ ఇన్వెస్టర్లకు 1.98 కోట్ల షేర్లను ఒక్కో షేర్‌ను రూ. 615-రూ. 650 ధర శ్రేణితో ఆఫర్‌ చేయనుంది. నిన్న ఈ ఈ షేర్‌ ఎన్‌ఎస్‌ఈలో రూ. 896 వద్ద ముగిసింది. నిన్న దాదాపు 2 శాతం మేర ఈ షేర్‌ క్షీణించింది. పలు బ్రోకింగ్‌ సంస్థలు ఈ షేర్‌ను సబ్‌స్క్రయిబ్ చేయమనే సలహా ఇస్తున్నాయి.