For Money

Business News

పేటీఎం లిస్టింగ్‌ నేడు: నిరాశ కల్గించనుందా?

జొమాటొ, నైకా, పాలిసీ బజార్‌ వంటి పెద్ద ఐపీఓలన్నీ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయ లాభాలు ఇచ్చాయి. సిగాచి వంటి చిన్న ఐపీఓలు కూడా అదిరిపోయే లాభాలను ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పేటీఎం పబ్లిక్‌ ఆఫర్‌ లిస్ట్‌ కానుంది. ఈ షేర్‌ను ఒక్కోరూ. 2150లకు పేటీఎం ఆఫర్‌ చేసింది. నిన్నటి దాకా గ్రే మార్కెట్‌ (అనధికార మార్కెట్‌)లో ఈ షేర్‌కు నామమాత్రపు ప్రీమియం మాత్రమే లభించింది. నిన్న రూ. 25 ప్రీమియం ఉందని, ఇవాళ లిస్టింగ్‌ రోజున రూ. 30 ప్రీమియం ఉండొచ్చిన భావిస్తున్నారు.ఇష్యూ ప్రారంభం రోజున రూ. 150 ఉన్న ప్రీమియం తరవాత కరిగిపోయింది. ఇవాళ లిస్టింగ్‌ రోజు దాదాపు లాభాలు ఉండకపోవచ్చని మార్కెట్‌ అనలిస్టులు అంటున్నారు. మరికొందరు నష్టాలు కూడా రావొచ్చని భావిస్తున్నారు.