రాజకీయాలకు గుడ్బై
![](https://formoney.in/wp-content/uploads/2024/06/Pandian.jpg)
ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి వీకే పాండ్యన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఇవాళ వీడియో సందేశం విడుదల చేశారు. 2000 బ్యాచ్కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి 2023లో బిజూ జనతాదళ్లో చేరిన విషయం తెలిసిందే. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉన్న పాండ్యన్ రెండు దశాబ్దాలుగా సీఎం పేషీలో కీలక పాత్ర పోషించారు. నవీన్కు వారసుడిగా పాండ్యన్ రాజకీయ అరంగేట్రం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈసారి జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఓడిపోయింది. 24 ఏళ్ళపాటు అధికారం ఉన్న నవీన్ ఓడిపోవడానికి కారణం… పాండ్యన్ను ఆయన తన రాజకీయ వారసుడిగా పరోక్షంగా ప్రకటించడం. దీంతో ఇవాళ పాండ్యన్ బిజూ పరివార్కు క్షమాపణలు చెప్పారు. తనపై జరిగిన ప్రచారం వల్ల పార్టీ ఓడిపోయిందని భావిస్తే తనను క్షమించాలని పాండ్యన్ కోరారు.