MID REVIEW: స్థిరంగా స్టాక్ మార్కెట్
ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ పది తరవాత లాభాల్లోకి వచ్చింది. ఉదయం 16,246 పాయింట్లను తాకిన నిఫ్టి మిడ్ సెషన్ సమయానికి 16420 పాయింట్లకు చేరింది. దాదాపు 200 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 16365 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 9 పాయింట్ల లాభంతో ఉంది. యూరో మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. యూరోస్టాక్స్ 500 సూచీ 0.75 శాతం నష్టంతో ఉంది. అమెరికా ఫ్యూచర్స్ మాత్రం నిన్నటి ముగింపు వద్దే ట్రేడవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ టాప్ గెయినర్ కాగా, టాటా స్టీల్ టాప్ లూజర్గా ఉంది. ఇవాళ నిఫ్టి బ్యాంక్ బలహీనంగా అర శాతం నష్టంతో ఉంది. మిగిలిన ప్రధాన సూచీలు క్రితం ముగింపు వద్దే ఉన్నాయి.