For Money

Business News

మస్క్‌ విరాళం రూ.630 కోట్లు

అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి బరిలోకి డొనాల్డ్‌ ట్రంప్‌ దిగిన వెంటనే ఆయనకు మద్దతు ప్రకటించిన అతి కొద్ది మంది పారిశ్రామికవేత్తల్లో ఎలాన్‌ మస్క్‌ ఒకరు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన వెంటనే బాహాటంగా ఆయనకు తన మద్దతు ప్రకటించారు ఎక్స్ (ట్విటర్‌) అధినేత ఎలాన్‌మస్క్‌. ప్రపంచంలోనే నంబర్‌ కోటీశ్వరుడుగా ప్రసిద్ధి చెందిన ఎలాన్‌ మస్క్‌…తాను మెచ్చిన పార్టీకి అదే స్థాయిలో ఆర్థిక సాయం చేస్తున్నారు. గడచిన మూడు నెలల్లో ట్రంప్‌ ప్రచారం కోసం ఎలాన్‌ మస్క్‌ 75 మిలియన్‌ డాలర్లు అంటే రూ. 630 కోట్ల విరాళం ఇచ్చినట్లు అమెరికా ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. జుల నుంచి ఆగస్టు మధ్య కాలంలో ట్రంప్‌ ఇచ్చిన విరాళాల మొత్తం ఇది. ఆ తరవాత ఇంకా ఇచ్చారేమో ఇంకా వెల్లడికాలేదు.ఈ స్థాయిలో విరాళం ఇవ్వడమేగాక… ట్రంప్‌తో పాటు స్వయంగా ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు ఎలాన్‌ మస్క్‌. వచ్చే నెల ఎన్నికల్లో ట్రంప్‌ గెలిస్తే.. ఆయన కేబినెట్‌లో చేరేందుకు తన అంగీకారాన్ని కూడా ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు.

Leave a Reply