For Money

Business News

తొలి రోజే కరేన్స్‌కు 7,738 బుకింగ్స్‌

కియా ఇటీవల మార్కెట్‌లో ప్రవేశపెట్టిన కరేన్స్‌ కారు ప్రి బుకింగ్స్‌ ఈ నెల 14 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి రోజే 7,738 కార్లకు బుకింగ్‌ వచ్చినట్లు కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌, సీఈఓ తే జిన్‌ పార్క్‌ వెల్లడించారు. దేశంలో తమ ఉత్పత్తులకు వచ్చిన అత్యధిక బుకింగ్‌ ఇదేనని ఆయన అన్నారు. రూ.25,000 చెల్లించి కారును బుక్‌ చేసుకోవచ్చు. అఇయదు వేరియంట్లలో ఈ కారు లభిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఈ కారుకు పోటీ టాటా సఫారీ, హ్యుందాయ్‌ అల్కజార్‌, మహీంద్రా XUV 700, MG హెక్టర్‌ ప్లస్‌ ఉన్నాయి.