పేటీఎంకు గుడ్ న్యూస్
పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్లో పెట్టుబడులు పెట్టేందుకు పేటీఎంకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పీటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్కు ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర లభించింది. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీని కోసం గతంలో దరఖాస్తు చేసుకోగా 2022 నవంబర్లో ఆర్బీఐ తిరస్కరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను అందుకు కారణంగా ఆర్బీఐ చూపింది. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్.. పేటీఎంలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న సంగతి తెలిసిందే.