For Money

Business News

దాల్మియా భారత్‌ చేతికి జేపీ సిమెంట్‌

జేపీ అసోసియేట్స్‌కు చెందిన సిమెంట్‌ ప్లాంట్‌ను దాల్మియా భారత్‌ కొనుగోలు చేయనుంది. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో జేపీ అసోసియేట్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది. క్లింకర్‌, పవర్‌ ప్లాంట్‌ను కూడా అమ్మేనున్నారు. ఈ డీల్‌ విలువ రూ. 5,666 కోట్లు. దీంతో దాల్మియా భారత్ షేర్‌ 4 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఈ సిమెంట్‌ ప్లాంట్‌ వార్షిక సామర్థ్యం 1.05 కోట్ల టన్నులు. బ్యాంకు రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో జేపీ అసోసియేట్స్‌ తన సిమెంట్‌ ప్లాంట్‌ను అమ్మేస్తోంది.