ధర రూ.32, టార్గెట్ రూ. 42
ప్రముఖ బ్రోకరేజ్ కంపెనీ సీఎల్ఎస్ తాజాగా ఎస్జేవీఎన్ షేర్ను కొనాల్సిందిగా సిఫారసు చేసింది. సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ (ఎస్జేవీఎన్) షేర్ ఇపుడు రూ. 32.47 వద్ద ట్రేడవుతోంది. తొలి ప్రథమార్థంలో కంపెనీ పలు ప్రాజెక్టులను పూర్తి చేసిందని, 2023కల్లా కంపెనీ సామర్థ్యం రెట్టింపు అయ్యే అవకాశముందని సీఎల్ఎస్ఏ అంచనా వేసింది. 50 గిగావాట్స్ సామర్థ్యం కోసం కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కన్పిస్తోంది. 2022-2025 మధ్య కాలంలో కంపెకనీ ఆర్ఈఈ రెట్టింపు అయ్యే అవకాశముందని పేర్కొంది. ఇదే కాలంలో కంపెనీ ఈపీఎస్ 45 శాతం పెరిగే అవకాశముందని పేర్కొంది. ప్రస్తుతం ఈ షేర్ ధర రూ.32.47 కాగా, రూ. 42 టార్గెట్గా సీఎల్ఎస్ఏ పేర్కొంది.