For Money

Business News

23న కేంద్ర బడ్జెట్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈనెల 23వ తేదీన పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఇవాళ ట్వీట్‌ చేశారు. ఈనెల 22 నుంచి వచ్చే నెల 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది.
ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తున్నారు.