For Money

Business News

గూగుల్‌ ఇండియా కీలక అధికారి రాజీనామా

మోడీ ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించి ప్రస్తుతం గూగుల్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ హెడ్‌గా ఉన్న అర్చనా గులాటీ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మే నెలలో ఆమె గూగుల్‌లో చేరారు. గూగుల్‌పై రెండు ప్రధాన కేసుల విచారణ ఇపుడు కీలక దశలో ఉంది. ఈ దశలో ఆమె రాజీనామా చేయడం ఢిల్లీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. గతంలో ఆమె కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)లో కూడా పనిచేశారు. ఆమె రాజీనామా వార్తను గూగుల్‌ ఇంకా ధృవీకరించలేదు. స్మార్ట్‌ టీవీ మార్కెట్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ఇన్‌-యాప్‌ పేమెంట్స్‌ సిస్టమ్స్‌పై భారత కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) విచారణ జరుపుతోంది.