For Money

Business News

పబ్లిక్‌ ఇష్యూకు మరో అదానీ కంపెనీ

అదానీ గ్రూప్‌నకు సంబంధించి స్టాక్‌ మార్కెట్‌లోఆరు కంపెనీలు లిస్టయి ఉన్నాయి. ఇపుడు ఏడో కంపెనీ రాబోతోంది. మార్కెట్‌ నుంచి రూ. 4,500 కోట్లు సమీకరించేందుకు అదానీ గ్రూప్‌, సింగపూర్‌ కంపెనీ విల్మర్‌ల నేతృత్వంలోని అదానీ విల్మర్‌ అనుమతి కోరుతూ సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. 2027కల్లా తాము దేశంలోనే నంబర్‌ వన్‌ ఫుడ్‌ కంపెనీగా అవతరిస్తామని ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది.ఫార్చ్యూన్‌, కింగ్స్‌, బుల్లెట్‌, రాగ్‌, అవసర్‌, పిలఫ్‌, జూబ్లి, ఫ్రైఓలా, ఆల్ఫా, ఎలైఫ్‌, ఆధార్‌ బ్రాండ్ల పేరుతో వివిధ రకాల ఉత్పత్తులను అదాని విల్మర్‌ విక్రయిస్తోంది.