స్విస్లో అదానీ ఆస్తులు జప్తు?
అదానీ గ్రూప్ మరో వివాదంలో ఇరుక్కుంది. అదానీ గ్రూప్నకు చెందిన సమారు 31 కోట్ల డాలర్ల అంటే రూ. 2,600 కోట్ల ఆస్తులను స్విట్జర్ల్యాండ్ అధికారులు జప్తు చేసినట్లు స్విస్కు చెందిన ఓ మీడియా సంస్థ వెల్లడించింది. తమ సొంత నిధులను వివిధ బినామీ కంపెనీల ద్వారా భారత్కు అదానీ కంపెనీలు తరలించాయని.. స్విస్ అధికారులు గుర్తించినట్లు ఈ వెబ్సైట్ రాసింది. స్థానిక క్రిమినల్ కోర్టులోని రికార్డుల ఆధారంగా ఈ వివరాలు బయటపడినట్లు గోథమ్ సిటీ అనే మీడియా సంస్థ వెల్లడించింది. అయితే ఈ దర్యాప్తు 2021లో జరిగినట్లు వెల్లడించింది. బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్, మారుతీ, బెర్ముడా వంటి ట్యాక్స్ హావెన్స్లో బోగస్ కంపెనీలను అదానీ ఏర్పాటు చేసినట్లు గోథమ్ సిటీ వెల్లడించింది. ఈ వెబ్సైట్ వార్తలోని అంశాలను హిండెన్బర్గ్ రీసెర్చి ఎక్స్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వార్త ఇపుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.