For Money

Business News

అవి నిరాధార వార్తలు

స్విస్‌ బ్యాంకుల్లోని తమ నిధులను ఆ దేశ దర్యాప్తు అధికారులు జప్తు చేశారంటూ వస్తున్న వార్తలను అదానీ గ్రూప్‌ ఖండించింది. అవన్నీ నిరాధార వార్తలని పేర్కొంది. 2021లో అదానీ గ్రూప్‌ బినామీ కంపెనీలపై దర్యాప్తు చేసి… నిబంధనలకు ఉల్లంఘించారంటూ రూ 2600 కోట్ల స్వాధీనం చేసుకున్నట్లు స్విస్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఆ వార్తను హిండెన్‌బర్గ్‌ రీసెర్చి ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీనిపై అదానీ గ్రూప్‌ స్పందిస్తూ… అవన్నీ నిరాధార వార్తలని… తమ విదేశీ వ్యాపార లావాదేవీలన్నీ పారదర్వకంగా ఉన్నాయని పేర్కొంది. తమపై స్విస్‌ కోర్టుల్లో ఎలాంటి ప్రొసీడింగ్స్‌ లేవని స్పష్టం చేసింది.

Leave a Reply