రూ. 4,900 పెరిగిన బంగారం
ఇవాళ కూడా బులియన్ మార్కెట్లో రికవరీ కొనసాగింది. నిన్న భారీగా పెరిగి బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగాయి. MCXలో పది గ్రాముల బంగారం ధర రూ. 4838 పెరిగి రూ. 1,43,750 వద్ద ట్రేడవుతోంది. ఇక కిలో వెండి ధర కూడా రూ. 11,592 పెరిగి రూ. 2,35,533కి చేరింది. స్పాట్ మార్కెట్లో కూడా ఇదే స్థాయిలో ధరలు పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్తకులు అంటున్నారు.
