For Money

Business News

జీ షేర్‌లో భారీ జంప్‌

కొన్ని నెలులుగా స్తబ్దుగా ఉన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్‌ ఇవాళ అనూహ్యంగా 15 శాతం దాకా పెరిగింది. ఈ క్రితం ముగింపు రూ. 135.20 కాగా ఇవాళ రూ. 154.90 గరిష్ఠ స్థాయిని తాకింది. తరవాత 11.6 శాతం లాభంతో రూ. 150.90 వద్ద ముగిసింది. దీనికి ప్రధాన కారణం.. సోనీతో ఈ కంపెనీ రాజీ కుదుర్చుకోవడం. ఈ రెండు కంపెనీల విలీన ప్రతిపాదన బెడసి కొట్టిన తరవాత.. రెండు కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. తాజాగా ఈ వివాదాలను ఇరు సంస్థలు సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. ఈ మేరకు ఇవాళ రెండు కంపెనీలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌తో పాటు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌, ఇతర ఫోరమ్స్‌లో పరస్పరం దాఖలు చేసుకున్న న్యాయ పోరాటాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాయి. ఎవరికి వారు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగాల్లో సొంతంగా రాణించడంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా నిర్ణయానికొచ్చాయి.