For Money

Business News

మార్కెట్‌లోకి కొత్త యమహా బైక్‌

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్స్​ దేశీయ మార్కెట్​లోకి కొత్త ఆర్​ 15 వీ3 మోడల్​ను లాంచ్​ చేసింది. ఈ బైక్​ ధరను రూ. 1.57 లక్షలు (ఎక్స్​షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. యూనిబాడీ సీట్​ డిజైన్​తో వచ్చే ఈ బైక్​ను దేశవ్యాప్తంగా అన్ని ఆథరైజ్డ్ డీలర్​షిప్​ సెంటర్లలో విక్రయించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రేసింగ్ బ్లూ క‌ల‌ర్‌లో ల‌భించే ఈ బైక్ స్టాండ‌ర్డ్ ఆర్‌15, వీ4 కంటే రూ 13,000 త‌క్కువ‌కు క‌స్టమ‌ర్ల ముందుకొచ్చింది. ఆర్‌15 వీ3 వేరియంట్ 155సీసీ, 4-స్ర్టోక్‌, లిక్విడ్ కూల్డ్‌, వంటి ఫీచ‌ర్ల‌తో ఆక‌ట్టుకుంటుంది. యమహా ఆర్ 15 ఎస్​ వి3 చూడటానికి చాలా స్టైలిష్​గా ఉంటుంది. దీనిలో అత్యాధునిక ఫీచర్లను అందించింది. ఇది గేర్​షిఫ్ట్ ఇండికేటర్​తో కూడిన మల్టీ ఫంక్షన్​ ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, డ్యూయల్​ఛానల్​ఏబీఎస్, అసిస్ట్​అండ్​స్లిప్లర్​క్లచ్, ఇంజిన్​కట్​ఆప్​ స్విచ్‌తో సైడ్​స్టాండ్, డెల్టాబాక్స్​ఫ్రేమ్, అల్యూమినియం స్వింగార్మ్, సూపర్​వైడ్​140/70 ఆర్17 రేడియల్ టైర్లను అందించింది.