For Money

Business News

ఈ షేర్‌ విలువ రూ. 2.5లే?

వోడాఫోన్‌ ఐడియా షేర్‌లో ఇవాళ తీవ్ర అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిన్న రూ. 15.09 వద్ద ముగిసిన ఈ షేర్‌ ఇవాళ 14 శాతం నష్టపోయి రూ. 12.91 వద్ద ముగిసింది. దీనికి ప్రధాన కారణంగా ఈ కంపెనీ షేర్‌పై అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ వేసిన అంచనానే. ఈ షేర్‌ ధర 83 శాతం పడిపోయే అవకాశముందని గోల్డ్‌మన్‌ అంచనా వేసింది. అంటే షేర్‌ ధర రూ.2.5కి పడిపోతుందని అంచనా వేసింది. ఇటీవల ఈ కంపెనీ భారీ ఎత్తున నిధులను సమీకరిస్తున్న విషయం తెలిసిందే. అయినా ఈ కంపెనీ వ్యాపారం రానున్న మూడు నాలుగేళ్ళలో మూడు శాతం దాకా క్షీణిస్తుందని గోల్డ్‌మ్యాన్‌ అంచనా వేసింది. కంపెనీ ఏపీఆర్‌యూ రూ. 200 నుంచి రూ. 270కు పెరగాల్సి ఉందని తెలిపింద. అంటే 120 శాతం నుంచి 150 దాకా ఏపీఆర్‌యూ పెరగాల్సి ఉందని వెల్లడించింది. వివిధ మార్గాల ద్వారా వొడాఫోన్‌ ఇటీవల రూ. 20వేల కోట్లను సమీకరించింది. మరో రూ. 25వేల కోట్ల సమీకరణకు ప్లాన్‌ చేస్తోంది.

Leave a Reply