AIలోకి టీసీఎస్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలోకి టీసీఎస్ అడుగు పెడుతోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు కొత్త కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక గిగావ్యాట్ డేటా సెంటర్లను నెలకొల్పుతున్నట్లు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కృతివాసన్ తెలిపారు. టాలెంట్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో్ కూడా తమ కొత్త జర్నీ ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఏఐ ప్రధాన టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీగా అవతరించాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు.