For Money

Business News

టాటాల చేతికి ఎయిర్‌ ఇండియా?

ఎయిర్‌ ఇండియా అమ్మకం ప్రక్రియ ఇవాళ్టికి ఓ కొలిక్కి వచ్చింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఎయిర్‌ ఇండియా కొనుగోలు కోసం వచ్చిన బిడ్‌లను పరిశీలిస్తోంది. కాస్సేపట్లో ఈ మంత్రి వర్గం తుది నిర్ణయం ప్రకటించనుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఎయిర్‌ ఇండియాకు ఏకైక బిడ్డర్‌గా టాటా గ్రూప్‌ రానుంది. ఈ లెక్కన ఎయిర్‌ ఇండియా టాటా చేతికి వెళ్ళిపోనుంది.