For Money

Business News

69 శాతం పెరిగిన తాన్లా లాభం

హైదారబాద్‌కు చెందిన కమ్యూనికేషన్ల సేవల సంస్థ తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. మూడో త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్‌ రూ.884.90 కోట్లకు చేరగా, రూ.158 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 35 శాతం, నికర లాభం 69 శాతం పెరిగింది. డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి గాను రూ.2,352.90 కోట్ల ఆదాయంపై రూ.398.70 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ వరుసగా 22 త్రైమాసికాలుగా అద్భుతమైన పనితీరును కనబరుస్తూ వస్తోందని సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌, సీఈఓ ఉదయ్‌ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ఇదే పనితీరును కనబరుస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.