For Money

Business News

తెలంగాణలో మ‌రో రూ. 200 కోట్ల పెట్టుబ‌డి

హైద‌రాబాద్‌లో భార‌త్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్(బీవీఎస్) సంస్థ పెట్టుబ‌డులు పెట్టనుంది. జీనోమ్ వ్యాలీలో రూ.200 కోట్లతో టీకాల త‌యారీ కేంద్రాన్ని బీఎస్‌వీ గ్లోబ‌స్ సంస్థ ఏర్పాటు చేయ‌నుంది. ఈ మేర‌కు ఆ సంస్థ ఎండీ సంజీవ్ నావ‌న్ గుల్‌.. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగ‌తి భ‌వ‌న్‌లో క‌లిసి ప్రక‌టించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చినందుకు ఆయనకు కేటీఆర్ ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు.