For Money

Business News

వినేష్‌ రాజీనామాకు ఆమోదం?

రైల్వే ఉద్యోగిగా ఉన్న రెజ్లర్లు వినేస్‌ ఫోగట్‌, భజరంగ్‌ పునియాల రాజీనామాలను రైల్వే శాఖ త్వరలోనే ఆమోదం తెలపనుంది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వీరిద్దరూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. వీరిద్దరూ ఇపుడు రైల్వే ఉద్యోగులుగా ఉన్నారు. ఎన్నికల బరిలో దిగనున్నందున వీరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. సాధారణంగా ఓ ఉద్యోగి రాజీనామా చేసే ముందు మూడు నెలల ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంది. అయితే వీరి విషయంలో తాము నిబంధనలను సరళించి… ఒకట్రెండు రోజుల్లోనే రాజీనామాలను ఆమోదిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో వీరిద్దరూ హర్యానా ఎన్నికల బరిలో దిగేందుకు అడ్డంకులు తొలగినట్లే.

Leave a Reply