For Money

Business News

ఫోన్‌ పేకు బీమా బ్రోకింగ్‌ లైసెన్స్‌

డిజిటల్‌ పే సంస్థ అయిన ఫోన్‌ పేకు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI) నుంచి బీమా బ్రోకింగ్‌ వ్యాపారం నిర్వహించేందుకు లైసెన్స్‌ లభించింది. దీంతో ఇన్సూరెన్స్‌ రంగంలో ఈ కంపెనీ పంపిణీదారుగా మారనుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ ఇతర కంపెనీలకు ఏజెంట్‌గా ఇన్సూరెన్స్‌ పాలసీలను అమ్ముతూ వచ్చింది. ఇక నుంచి స్వయంగా పాలసీలను అమ్మే అవకాశం లభించింది. షేర్‌ మార్కెట్‌ బ్రోకింగ్‌ వ్యాపారంలో ప్రవేశించేందుకు కూడా ఈ కంపెనీ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) అనుమతి కోసం దరఖాస్తు చేసింది.