For Money

Business News

తెలంగాణ‌లో మరిన్ని పెట్టుబడులు

తెలంగాణ‌లో మరిన్ని పెట్టుబ‌డులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. మ‌హేశ్వరం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఈ – సిటీలో విప్రో కన్జూమర్‌ కేర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్లాంట్‌ను ప్రారంభించారు. తరవాత ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ వెరీవెరీ ఛార్మింగ్ అని ప్రేమ్‌జీ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబ‌డిదారుల‌కు ప్రోత్సాహ‌కంగా ఉంద‌ని కొనియాడారు. క‌రోనా నియంత్రణ‌లో తెలంగాణ కీల‌కంగా నిలిచింద‌న్నారు. పెట్టుబ‌డుల‌తో స్థానిక యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. తాము స్థాపించ‌బోయే కంపెనీల్లో మ‌హిళ‌ల‌కు ఎక్కువ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని ప్రేమ్‌జీ తెలిపారు.