For Money

Business News

విశాఖ ఉక్కుపై మిట్టల్‌ కన్ను

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మాతృసంస్థ రాష్ర్టీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌, విశాఖ స్టీల్‌) కొనుగోలు కోసం బిడ్‌ దాఖలు చేయాలని మిట్టల్‌ గ్రూప్‌ కంపెనీ ఏఎంఎన్‌ఎస్‌ ఇండియా (ఆర్సెలార్‌ మిట్టల్‌/నిప్పాన్‌ స్టీల్‌) యోచిస్తోంది. వీఎస్‌పీ టేకోవర్‌కు తాము సిద్ధమని టాటా స్టీల్‌ ఇప్పటికే ప్రకటించింది. ఏఎంఎన్‌ఎస్‌ కంపెనీ.. ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ రెండింటి జాయింట్‌ వెంచర్‌. విశాఖ ప్లాంట్‌ అత్యంత కీలక ప్రాంతంలో ఉన్నందు వల్ల దాన్ని కొనుగోలు చేయాలన్న ఆసక్తి తమకున్నదని టాటా స్టీల్‌ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ టీవీ నరేంద్రన్‌ ఇటీవల ప్రకటించారు. మరోవైపు పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమవుతారని ఏఎంఎన్‌ఎస్‌ ట్వీట్‌ చేసింది. అయితే ఆ సమావేశం దేనికో మాత్రం వెల్లడించలేదు.