For Money

Business News

లిస్టింగ్‌ రోజే 100 శాతం లాభం

ఒకవైపు స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ల తాజా డార్లింగ్‌ కళ్యాణ్‌ జువలర్స్‌ దారుణంగా పడుతుంటే… ఇవాళే లిస్టయిన కాబ్రా జువెలర్స్‌ లిస్టింగ్‌ రోజే వంద శాతం లాభాలను అందించింది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ కంపెనీ షేర్లు ఇవాళ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయ్యాయి. ఈ కంపెనీ షేర్‌ ఇష్యూ ధర రూ.128 కాగా.. ఎన్‌ఎస్‌ఈలో రూ.255.35 వద్ద ముగిసింది. అయిదు శాతం అప్పర్‌ సీలింగ్‌తో ఈ షేర్‌ క్లోజ్‌ కావడం విశేషం. ఈ ధర వద్ద అమ్మకందారులే లేరు. ఎస్‌ఎంఈ విభాగం నుంచి వచ్చిన ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.40 కోట్లు సమీకరించనుంది. ఎస్‌ఎంఈ విభాగంలో షేర్ల ధరల్లో మాయ జరుగుతోందని తీవ్ర ఆరోపణలు వస్తున్నా… ఈ విభాగంలో షేర్లు భారీ ప్రీమియంతో లిస్ట్ కావడం గమనార్హం.పైగా పబ్లిక్‌ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను ఈ కంపెనీ రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం ఉపయోగించడం వినా… వ్యాపార విస్తరణ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం విశేషం. మరి ఈ షేర్‌కు ఇంత భారీ ప్రీమియం చెల్లించాలనే విమర్శలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి.