For Money

Business News

ఐటీ రిటర్నుల గడువు పొడిగింపు?

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల గడువును ప్రభుత్వం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఐటీ పోర్టల్‌కు సంబంధించి ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చని సీఎన్‌బీసీ టీవీ 18 న్యూస్‌ ఛానల్‌ పేర్కొంది. పన్ను చెల్లింపుదార్లు ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి ఈ నెల 31 వరకు గడువు ఉంది. ఈ నెల 25 వరకు 4.43 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.