For Money

Business News

హ్యుండాయ్‌ ఐపీఓ 14న

భారత దేశ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. ఈనెల 14వ తేదీన హ్యుండాయ్‌ మోటార్స్‌ ఇండియా పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభం అవుతుంది. 16వ తేదీన ముగుస్తుంది. ఈ ఆఫర్‌ ద్వారా కంపెనీ 300 కోట్ల డాలర్లను సమీకరించాలని నిర్ణయించింది. పశ్చిమాసియాలోని పరిస్థితులను బట్టి ఐపీఓ ప్రారంభం,ముగింపు తేదీల్లో మార్పు ఉండే అవకాశముంది. రూ. 25,000 కోట్ల ఈ పబ్లిక్‌ ఆఫర్‌ దేశ చరిత్రలోనే అది పెద్దది. ఈ ఆఫర్‌ కోసం కంపెనీ వ్యాల్యూయేషన్‌ను 3000 కోట్ల డాలర్లుగా పేర్కొన్నట్లు సమాచారం. పబ్లిక్‌ ఆష్యూ ధరల శ్రేణి తదతర వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Leave a Reply