For Money

Business News

నిరాశపర్చిన లిస్టింగ్‌

హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఐపీఓ లిస్టింగ్‌ ఊహించినట్లే నిరాశ కల్గించింది. ఒక్కో షేరును రూ.1960 కేటాయించగా ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో రూ. 1934 వద్ద ఓపెనైంది. వెంటనే ఈ షేర్‌ రూ. 1844ను తాకింది. అక్కడి నుంచి కోలుకుని ఇపుడు రూ.1907 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో 1.48శాతం డిస్కౌంట్‌తో రూ.1,931 షేర్లు లిస్టయ్యాయి. పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 17న ముగిసిన విషయం తెలిసింది.ఈ ఆఫర్‌ ద్వారా కంపెనీ రూ.27,870 కోట్లు సమీకరించింది.

Leave a Reply