For Money

Business News

హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత కంపెనీ

ప్రపంచ ప్రఖ్యాత కాల్అవే గోల్ఫ్ కంపెనీ హైద‌రాబాద్‌లో డిజిటెక్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్రక‌టించింది. అమెరికాలో ప‌ర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌తో ఆ కంపెనీ ప్రముఖులు చ‌ర్చలు జ‌రిపారు. అనంత‌రం ఈ ప్రక‌ట‌నను విడుద‌ల చేశారు. 320 కోట్ల డాల‌ర్ల వార్షిక ఆదాయం గల ఈ కంపెనీ హైదరాబాద్‌ సెంటర్‌లో 300 మంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెష‌న‌ల్స్‌కు ఉపాధి కల్పించనుంది. ఈ కేంద్రం డేటా అన‌లిటిక్స్‌తోపాటు ఆ కంపెనీ గ్లోబ‌ల్ ఆప‌రేష‌న్స్‌కు ఐటీ బ్యాకెండ్‌ స‌పోర్ట్‌ను అందించ‌నుంది. డిజిటెక్ సెంట‌ర్ ఏర్పాటుకోసం దేశంలోని వివిధ న‌గ‌రాల‌ను ప‌రిశీలించిన కాల్అవే కంపెనీ, చివ‌ర‌గా హైద‌రాబాద్‌ను ఎంచుకుంది.