For Money

Business News

ఈ రెండు షేర్లు రేపటి కోసం

స్టాక్‌ మార్కెట్‌లో రేపటి కోసం అంటే గురువారం కొనేందుకు రెండు షేర్లను ఎన్‌ఏవీ ఇన్వెస్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ అయిన ఆశిష్ బహతి సూచించారు. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌తో ఇవాళ ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా నిలకడగా రాణిస్తున్న భారత్‌ ఫోర్జ్‌ షేర్‌ను ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయాల్సిందిగా ఆయన రెకమెండ్‌ చేశారు. ఈ షేర్‌ టార్గెట్‌ రూ. 1640/రూ.1660గా పేర్కొన్నారు. ఈ కౌంటర్‌కు స్టాప్‌లాస్‌ రూ. 1580. అలాగే ఫార్మా రంగానికి చెందిన లారస్‌ ల్యాబ్‌ను కూడా రేపటి ట్రేడింగ్‌ కోసం కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. ఈ షేర్‌ టార్గెట్‌ రూ 485 కాగా, ఇన్వెస్టర్లు రూ. 467ను స్టాప్‌లాస్‌గా పెట్టుకుని ట్రేడ్‌ చేయాలని సూచించారు. అలాగే నిఫ్టిలో ఇప్పటికే పొజిషన్‌ తీసుకున్నవారు కొనసాగించవచ్చని… కొత్తగా కొనాలనుకునే వారు మాత్రం కాస్త ఆగడం మంచిదని అన్నారు. నిఫ్టిని కొనసాగించేవారు 25,050ని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని అన్నారు. అలాగే బ్యాంక్‌ నిఫ్టిలో పెద్ద యాక్షన్‌ లేదని.. అయినా… ఈ కౌంటర్‌లో ఉన్నవారు 51,100 స్టాప్‌లాస్‌గా పెట్టుకుని ట్రేడ్‌ చేయాలని అన్నారు. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి 51,400 వద్ద ముగిసింది. టాటా స్టీల్‌ షేర్‌ విషయంలో ఆయన పాజిటివ్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ షేర్‌ రూ. 151 వద్ద ఇవాళ ముగిసింది. పొజిషనల్‌ ఇన్వెస్టర్లు రూ.147 స్టాప్‌లాస్‌తో ఈ కౌంటర్‌లో లాంగ్‌ పొజిషన్‌ కొనసాగించవచ్చని… టాటా స్టీల్‌ టార్గెట్‌ రూ.180గా పేర్కొన్నారు.