For Money

Business News

అదరగొట్టిన ఎస్‌ఎంఎస్‌ ఫార్మా

హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎంఎస్‌ ఫార్మా ఇవాళ బ్రహ్మాండమైన లాభంతో ముగిసింది. మార్కెట్‌ భారీ నష్టాల్లో ఉన్నా ఈ కౌంటర్‌లో భారీ లాభాలు నమోదు అయ్యాయి. ఇటీవల 20 శాతం దాకా పెరిగిన ఈ షేర్‌ ఇవాళ కూడా అదే స్థాయి ట్రెండ్ చూపించింది. నిన్న రూ. 341 వద్ద ముగిసిన ఈ షేర్‌ ఇవాళ ఆరంభం నుంచి పెరుగుతూ ఒకదశలో రూ. 391.65ని తాకింది. అయితే మూడు గంటల ప్రాంతం నుంచి స్వల్ప లాభాల స్వీకరణ కారణంగా రరూ. 373.80 వద్ద ముగిసింది. చాలా స్పీడుగా ఈ కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ రూ.3000 కోట్లను దాటడం విశేషం. ఈ షేర్‌ త్వరలోనే రూ. 400 స్థాయిని క్రాస్‌ చేస్తుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. మరి సెప్టెంబర్‌ నెల ఫలితాల లోపు ఈ షేర్‌ రూ.500 స్థాయిని క్రాస్‌ చేస్తుందా అన్నది చూడాలి.

Leave a Reply