For Money

Business News

ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు కాస్సేపటి క్రితం పూర్తయ్యాయి. రామోజీరావు స్వయంగా డిజైన్‌ చేసి నిర్మించుకున్న స్మృతి వనంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ఆయన అభిమానులు, రామోజీ గ్రూప్‌ ఉద్యోగులతో స్మృతివనం నిండిపోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్మృతి వనం వద్ద నివాళులర్పించిన అనంతరం రామోజీరావు పాడె మోశారు. అంతకుమునుపు ఆయన నివాసం నుంచి స్మృతి వనం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగింది.