For Money

Business News

భాసిన్‌ షేర్లన్నీ బంపర్‌ హిట్

గత మూడు రోజుల నుంచి షేర్‌ మార్కెట్‌ తీవ్ర ఒడుదుడుకులకు లోనైంది. ముఖ్యంగా నిఫ్టి 1000 పాయింట్లు నష్టపోయింది. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు తరవాత అనేక షేర్లపై ఒత్తిడి వచ్చింది. అయితే ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు సంజీవ్‌ భాసిన్‌ గత మూడు రోజుల నుంచి కొన్ని షేర్లను ఆయన పదే పదే సిఫారసు చేశారు. మార్కెట్‌ ఎంత పడినా సోమవారం నుంచి మార్కెట్‌ కోలుకుంటుందంటూ పలు షేర్లు సిఫారసు చేశారు. ఆయన పలుమార్లు రెకమెండ్‌ చేసిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవాళ ఆరు శాతం పెరిగి ఆయన ఇచ్చిన టార్గెట్‌ను దాటింది. అలాగే ఆయన సిఫారసు చేసిన గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌తో పాటు ఇవాళ కూడా రెకమెండ్‌ చేసిన హిందాల్కో షేర్లు ఆయన ఇచ్చిన టార్గెట్‌ను దాటడం విశేషం. అలాగే నిన్న ఆయన పదే పదే రెకమెండ్‌ చేసిన టైటాన్ కంపెనీ షేర్‌ ఇవాళ ఏకంగా ఆరు శాతంపైగా పెరిగి ఆయన ఇచ్చిన టార్గెట్‌ను దాటేసింది.ఇంకా సిఫారసు చేసిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సెయిల్‌ షేర్లు కూడా టార్గెట్‌ దాటడం విశేషం.