For Money

Business News

మార్కెట్‌కు ఫడ్నవీస్‌ బూస్ట్‌

ఉదయం మార్కెట్‌ లాభాల్లో ప్రారంభమైనా.. తరవాత నష్టాల్లోకి జారుకుంది. 24573 పాయింట్లను తాకినా తరవాత 24366కి అంటే దాదాపు 200 పాయింట్లు క్షీణించింది. ఈలోగా మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లు వార్తలు రాగానే మార్కెట్‌ గ్రీన్‌లోకి వచ్చింది. ఇపుడు 24490 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్‌ సాగుతున్నందున బ్యాంకు షేర్లు వెలుగులో ఉన్నాయి. ఈసారి కనీసం పావు శాతమైనా వడ్డీ రేట్లు తగ్గిస్తారనే ఆశను బ్యాంకర్లు వ్యక్తం చేస్తున్నారు. ఆటో షేర్లలో ఇవాళ లాభాల స్వీకరణ కన్పిస్తోంది. మెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇవాళ నిఫ్టికి అండగా నిలిచాయి.