For Money

Business News

వైజాగ్‌కు 5జీ సేవలు

విశాఖపట్నంలో ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో ఇప్పటికే 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్‌టెల్‌.. ఇపుడ విశాఖలోనూ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తమ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన 18వ నగరం విశాఖ అని ఎయిర్‌టెల్‌ తెలిపింది. విశాఖలోని ద్వారకానగర్‌, బీచ్‌ రోడ్డు, దాబా గార్డెన్స్‌, మద్దిలపాలెం, వాల్తేర్‌ అప్‌ల్యాండ్స్‌, పూర్ణా మార్కెట్‌, గాజువాక జంక్షన్‌, ఎంవీపీ కాలనీ, రాంనగర్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు, తెన్నేటి నగర్‌ సహా పలు ప్రాంతాల్లో ఈ సేవలు లభిస్తాయని ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. సిమా మార్చకుండానే 4జీ సేవలు పొందుతున్న వినియోగదారులు ఉచితంగానే 5జీ సేవలు పొందొచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది. అయితే ఫోన్‌కు 5జీ సపోర్ట్‌ ఉండాలని పేర్కొంది.