పెరిగిన డాలర్ మిలియనీర్లు
మన దేశంలో డాలర్ మిలియనీర్లు (రూ.7.5 కోట్ల వ్యక్తిగత సంపద ఉన్నవారు) పెరిగారు. గతేడాది 11 శాతం పెరిగినట్టు హురున్ రిపోర్ట్ సర్వేలో తేలింది. కరోనా ప్రభావంలోనూ భారత్లో డాలర్ మిలియనీర్ల సంఖ్య 4.58 లక్షలను తాకినట్టు ఆ నివేదిక పేర్కొంది. 2026 నాటికి దేశంలో డాలర్ మిలియనీర్ల సంఖ్య 30 శాతం పెరిగి 6 లక్షలను తాకవచ్చని అంచనా వేసింది. ముంబైలో అత్యధికంగా 20,300 మంది డాలర్ మిలియనీర్లు ఉన్నారు. ఢిల్లీలో 17,400, కోల్కతాలో 10,500 మంది డాలర్ మిలియనీర్లు ఉన్నట్లు హురున్ రిపోర్టు వెల్లడించింది.