For Money

Business News

‘ధర్మా’లో రిలయన్స్‌ వాటా?

డిస్నీల్యాండ్‌ డీల్‌ ఇంకా పూర్తి కాకుండానే మరో భారీ డీల్‌పై కన్నేసింది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. బాలీవుడ్‌లో టాప్‌ ఫైవ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌గా ఉన్న ధర్మా ప్రొడక్షన్‌లో వాటా కొనేందుకు రిలయన్స్‌ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహర్‌కు చెందిన ఈ కంపెనీ పలు సినిమాలను నిర్మించడమే గాక… అనేక మూవీలను మార్కెట్‌ చేస్తోంది. ఇప్పటికే న్యూస్‌ విభాగంలో రాణిస్తున్న రిలయన్స్‌ కంపెనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో మరింత చొచ్చుకోవాలని భావిస్తోంది. అయితే ధర్మాలో ఏమాత్రం వాటా కొంటున్నారనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే రిలయన్స్‌ కంపెనీ చేతిలో జియో స్టూడియోస్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సంస్థలు ఉన్నాయి. ధర్మాలో కొంత వాటా అమ్మేందుకు కరణ్‌జోహర్‌ కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply