For Money

Business News

పెట్రోల్‌పై స్పెషల్‌ డ్యూటీ ఎత్తివేత

పెట్రోల్‌, డీజిల్‌పై ఇది వరకు విధించిన స్పెషల్‌ అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై ఇక నుంచి ఈ డ్యూటీ రూ. 3లకు తగ్గగా, డీజిల్‌పై పూర్తిగా ఎత్తివేసింది. ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం పెట్రోల్‌పై రూ. 13, డీజిల్‌పై రూ. 10 స్పెషల్‌ అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ఉండేది. తాజాగా రెండింటిపై రూ.10 తగ్గించారు. దీంతో డీజిల్‌పై ఈ డ్యూటీ జీరోకు వచ్చేసింది. పెట్రోల్‌పై రూ. 3కి తగ్గింది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరగడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply